- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ బాలల దినోత్సవం,దేశ తొలి ప్రధాని జయంతి సందర్భంగా మండలంలోని కొయ్యుర్ విద్యోదయా ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ కుడుదుల రాజు ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా విద్యార్థులచే నిర్వహించారు. ఈ సందర్భంగా బాలలు ఉపాధ్యాయులుగా వేషధారణలో విద్యార్థులకు చదువును భోదించిన విధాన్ని స్వయంగా పాఠశాల గదులలో కూర్చుని వీక్షించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



