నవతెలంగాణ – భువనగిరి
జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు భాగంగా నిర్వహించిన పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని టి ఎన్జీవో రాష్ట్ర నాయకులు మందాడు ఉపేందర్రెడ్డి స్థానిక తహసిల్దార్ అంజిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాయ దశరథ లు ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఎండి. అవైస్ ఉర్ రెహ్మాన్ చిస్తి అధ్యక్షతన సమావేశం జరిగింది. హైదరాబాద్ వాస్తవ్యులు పింగళి వెంకటకృష్ణ రావు రచించిన సుమారు 100 పుస్తకములు అతని కుమారుడు పింగళి పవన్ కుమార్, జిల్లా కేంద్ర గ్రంథాలయానికి బహుకరించినారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ సంఘం జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం సుధీర్, గ్రంథపాలకులు టీ. మధుసూదన్ రెడ్డి , జి రాజ్యలక్ష్మి, సిహెచ్ రుకోదర్, కే జంపయ్య, గ్రంథాలయ ఉద్యోగులు, మాటూరి బాలేశ్వర్, తాడూరి కిష్టయ్య, అక్కినేనిపల్లి నరసింహారావు పాల్గొన్నారు.
గ్రంథాలయ వారోత్సవాలలో పుస్తక ప్రదర్శన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



