- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ దర్యాప్తులో వేగం పెంచిన NIA సూచనలతో, జామియానగర్లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీపై ఈడీ దాడులు నిర్వహించింది. యూనివర్సిటీకి వచ్చిన నిధులు ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లించారన్న అనుమానంతో ప్రధాన కార్యాలయం సహా 24 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. జైషే మాడ్యూల్ పాత్ర బయటపడుతున్న నేపథ్యంలో ఈ విచారణకు ప్రాధాన్యం పెరిగింది. కాగా, ఇటీవల చాందినీ చౌక్ మెట్రో సమీపంలో జరిగిన కారు బాంబు దాడిలో మరణించిన వారి సంఖ్య 15కి చేరింది.
- Advertisement -



