నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటుకు కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (సీఒఎల్)తో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అవగాహన ఒప్పందం కుదిరింది. యూనివర్సిటీ ఈ అవగాహన ఒప్పందంతో ప్రముఖ డిజిటల్ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందనున్నది. బోధన, అభ్యాసం, పరిశోధన లను మెరుగుపరచడానికి ఐడియా అత్యాధునిక డిజిటల్ హబ్గా పనిచే స్తుంది. దీంతో యూనివర్సిటీ టెక్నాలజీ ద్వారా నాణ్యమైన విద్యను అందిం చనున్నది. తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలను బలో పేతం చేయడంతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఒక నాలెడ్జ్ హబ్ గా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సిఓఎల్ అధ్యక్షులు పీటర్ స్కాట్కు తెలిపారు. ఈ సమా వేశంలో కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ అధ్యక్షులు, సిఇఓ పీటర్ స్కాట్, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ ఘంటా చక్రపాణి, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సీఎం సమక్షంలో సీఓఎల్ తో బీఆర్ఏఓయూ ఒప్పందం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



