- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : 2015 గ్రూపు-2 నోటిఫికేషన్ పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2015లో గ్రూపు-2 ఓఎమ్ఆర్ షీట్ ట్యాంపరింగ్ పిటిషన్పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. 2019లో ఇచ్చిన సెలక్షన్ లిస్ట్ను రద్దు చేసింది. ఓఎమ్ఆర్ షీట్ను రీవాల్యూయేషన్ చేసి మళ్లీ సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలని ఆదేశించింది. 8 వారాల్లో తుది లిస్ట్ను ప్రకటించాలని టీజీపీఎస్సీకి డెడ్లైన్ విధించింది. అంతేకాదు.. టీజీపీఎస్సీ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిందని.. పరిధి దాటి వ్యవహరించిందని మండిపడింది.
- Advertisement -



