- Advertisement -
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
నృత్యమాల నాట్యకళా వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా బాలోత్సవ్-2025 అంతర్జాతీయ నృత్య మరియు సంగీత విభావరి పోటీలు ఈ నెల 16-11-2025 (ఆదివారం)న రవీంధ్రభారతిలో జరిగాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్న ఈ ఉత్సవంలో విజయ్ హైస్కూల్లో 2వ తరగతి చదువుతున్న జి.ఆద్యశ్రీ కూచిపూడి నృత్యాన్ని అభినయించి మెమెంటో , ప్రశంసాపత్రాన్ని అందుకుంది. ఈ సందర్భంగా చిన్నారి జి. ఆద్యశ్రీ ని విజయ్ హైస్కూల్ వ్యవస్థాపకురాలు డా. అమృతలత అభినందించారు.
- Advertisement -



