నవతెలంగాణ – హైదరాబాద్: సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి బంధువులను కేటీఆర్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ నెల 17న సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 42 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అడిక్మెట్, రాంనగర్, విద్యానగర్లోని మృతుల కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. సౌదీ బస్సు ప్రమాదంలో 42 మంది తెలంగాణ వాసులు చనిపోయారు. ఒకే కుటుంబంలో 18 మంది మరణించడం బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులు సౌదీ అరేబియా వెళ్లారు. వారికి బాసటగా నిలిచేందుకు బీఆర్ఎస్ బృందం కూడా సౌదీ అరేబియా వెళ్లింది. అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడి వారికి అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ చెప్పారు.
సౌదీ బస్సు ప్రమాదం… మృతుల కుటుంబాలకు కేటీఆర్ భరోసా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



