Saturday, November 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండిసెంబర్‌ 11, 12 తేదీల్లో చారిత్రక నాణేల జాతీయ సదస్సు

డిసెంబర్‌ 11, 12 తేదీల్లో చారిత్రక నాణేల జాతీయ సదస్సు

- Advertisement -

– హైదరాబాద్‌లో నిర్వహణ
– బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

హైదరాబాద్‌ మరో జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. రాష్ట్రంలో తొలిసారిగా జాతీయస్థాయిలో చారిత్రక నాణేల సదస్సు నిర్వహణకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వారసత్వశాఖ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 11, 12 తేదీల్లో 107వ వార్షిక జాతీయ నాణేల సదస్సు, సెమినార్‌ను నిర్వహించనున్నారు. ఈ సదస్సు బ్రోచర్‌ను శుక్రవారం డా.బీఆర్‌. అంబేద్కర్‌ సచివాలయంలో పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కష్ణారావు లాంఛనంగా ఆవిష్కరించారు. న్యూమిస్మాటిక్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌ఐ) సహకారంతో తెలంగాణ వారసత్వ శాఖ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక సదస్సును నిర్వహిస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావం తరువాత నాణేల అధ్యయనంపై జాతీయ స్థాయి కార్యక్రమం హైదరాబాద్‌లో జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కష్ణారావు మాట్లాడుతూ నాణేల చరిత్ర ద్వారా తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని దేశానికి చాటి చెప్పేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

రెండు రోజుల సదస్సు
జూబ్లీహిల్స్‌లోని డా. ఎంసీహెచ్‌ఆర్టీ సంస్థలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు భారతదేశ నలుమూలల నుంచి విద్యార్థులు, స్కాలర్లు, పరిశోధకులు, న్యూమిస్‌మటిక్స్‌ నిపుణులు పాల్గొనే ఈ సదస్సు, నాణేల చారిత్రక, సాంస్కృతిక, కళాత్మక ప్రాముఖ్యతపై చర్చించేందుకు ఒక వేదికగా ఇది ఉపయోగపడనుందని భావిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక పురావస్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, వారసత్వ శాఖ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ అర్జున్‌రావు కుతాడి, డిప్యూటీ డైరెక్టర్లు డా. డి.రాములు, డా. పీ నాగరాజు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -