నవతెలంగాణ -వలిగొండ రూరల్
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య మృతదేహాన్ని వలిగొండ మండలంలోని భీమలింగం కాల్వలో వేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు రామన్నపేట సీఐ వెంకటేష్ తో కలిసి మృతుని ఆచూకీ తెలుసుకుని మృతుని భార్యను విచారించగా ఆమె అనుమానాస్పదంగా మాట్లాడటంతో అసలు విషయం బయటకు వచ్చింది. వివరలోకి వెలితే.. భర్త సమీప బంధువైన భువనగిరి మండలంలోని గౌస్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ స్వామితో మంగ అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసిన భర్త మంగను పలుమార్లు ఆమెను మందలించాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున పల్లెర్ల స్వామి ప్రియురాలి ఇంటికి రావడంతో ఇరువురు కలియబడ్డారు. వారి ఇద్దరి మధ్య జరిగిన తోపులాటలో సురేష్ మృతిచెందాడు. మృతిచెందిన సురేష్ మృతదేహాన్ని స్వామి, మంగ కలిసి ఆటోలో భీమలింగం కత్వ సమీపంలోకి తీసుకవెళ్లి కాల్వలో పడేసామని ఇరువురు ఒప్పుకున్నట్లు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో శుక్రవారం రిమాండ్ చేసినట్లు స్థానిక ఎస్సై యుగందర్ తెలిపారు.
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES