- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండల శివారు మల్కాపూర్ రోడ్లో ట్రాక్టర్ టైర్ కింద నలిగి హుస్సేన్ (55) అనే వలస కూలీ మృతి చెందాడు. హుస్సేన్ ట్రాక్టర్పై పత్తి పనికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ట్రాక్టర్ టైర్ అతనిపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



