Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్రస్థాయి పేరణ అవార్డుకు విద్యార్థి ఎంపిక 

రాష్ట్రస్థాయి పేరణ అవార్డుకు విద్యార్థి ఎంపిక 

- Advertisement -

నవతెలంగాణ – మోర్తాడ్ 
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి రాష్ట్రస్థాయి పేరణ అవార్డుకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ తెలిపారు. పదవ తరగతి విద్యార్థి ప్రత్యుత్ తయారు చేసిన ప్రాజెక్ట్ రాష్ట్రస్థాయిలో ఎంపిక గుర్తింపు రావడంతో ఈ విద్యార్థి రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికైనట్లు తెలిపారు. గైడ్  పనిచేసిన వినోద్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల అశోక్, దీపిక, రవీందర్, రవి, ఇంద్ర ,శకుంతల, రాము, భూలక్ష్మి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -