‘వీరసింహారెడ్డి’ సంచలన విజయం తర్వాత బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని వద్ధి సినిమాస్ బ్యానర్పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
బాలకష్ణ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ‘సింహ, జై సింహా, శ్రీ రామరాజ్యం’ తర్వాత బాలకష్ణ, నయనతార కలిసి నటిస్తున్న 4వ చిత్రం ఇది. ఈ ప్రాజెక్టు బుధవారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ స్క్రిప్ట్ను నిర్మాతలకు అందజేశారు. బాలకష్ణతో అనేక బ్లాక్బస్టర్లను అందించిన దర్శకుడు బి.గోపాల్ క్లాప్ కొట్టారు. బాలయ్య కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి షాట్కు బోయపాటి శ్రీను, బాబీ, బుచ్చి బాబు సమిష్టిగా దర్శకత్వం వహించారు.
గోపిచంద్ మలినేని తొలిసారిగా హిస్టారికల్ డ్రామాలోకి అడుగు పెడుతున్నారు. కమర్షియల్ బ్లాక్బస్టర్స్ రూపొందించే తన ప్రత్యేక మాస్ టచ్ను ఒక భారీ చారిత్రక కథలో మిళితం చేస్తూ, బాలకష్ణను ఇప్పటివరకు చూడని ఓ కొత్త అవతార్ చూపించబోతున్నారు.
స్పెషల్ పోస్టర్లో బాలకష్ణ.. ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో యాంకర్ పట్టుకుని అఖండమైన రాజసంతో కనిపించారు. గడ్డం, పొడవాటి జుట్టు, శక్తివంతమైన తీరుతో సమరశూరుడిలా అదరగొట్టారు. హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భావోద్వేగాలు, అద్భుతమైన యాక్షన్, విజువల్ వండర్గా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచబోతోంది
మిగిలిన తారాగణం, సాంకేతిక సిబ్బందికి సంబంధించిన వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
మహారాజుగా బాలయ్య..
- Advertisement -
- Advertisement -



