మహిళల బిగ్బాష్ లీగ్కు జెమీమా దూరం
ముంబయి : భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్, ఐసీసీ 2025 వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్లో ఆసీస్పై అజేయ సెంచరీతో చారిత్రక విజయం అందించిన జెమీమా రొడ్రిగ్స్ ఈ సీజన్ మహిళల బిగ్బాష్ లీగ్కు దూరం కానుంది. ఐసీసీ వన్డే వరల్డ్కప్ విజయానందంలో ఉన్న మహిళా క్రికెటర్లు.. ఒక్కసారిగా స్మతీ మంధాన వివాహ అర్థాంతరంగా ఆగిపోవటంతో కాస్త ఆందోళనలో పడ్డారు. మంధాన తండ్రి అనారోగ్యంతో ఆసుప్రతిలో చికిత్స పొందుతుండగా..ఈ సమయంలో సహచర క్రికెటర్కు దన్నుగా నిలిచేందుకు జెమీమా రొడ్రిగ్స్ మహిళల బిగ్బాష్ లీగ్కు దూరమైంది. మహిళల బిగ్బాష్ లీగ్లో జెమీమా రొడ్రిగ్స్ బ్రిస్బేన్ హీట్ తరఫున ఆడాల్సి ఉంది. ఈ సీజన్లో ఆడిన ఆరు మ్యాచుల్లోనూ ఓడిన బ్రిస్బేన్ హీట్స్ అంచనాలను ఏమాత్రం అందుకోవటం లేదు.



