Friday, November 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలువాయు కాలుష్యంపై పార్ల‌మెంట్‌లో విస్త్రృతంగా చ‌ర్చ‌ జ‌ర‌గాలి: రాహుల్ గాంధీ

వాయు కాలుష్యంపై పార్ల‌మెంట్‌లో విస్త్రృతంగా చ‌ర్చ‌ జ‌ర‌గాలి: రాహుల్ గాంధీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: శీతాకాల పార్ల‌మెంట్ స‌మావేశాల్లో దేశంలో నెల‌కొన్న వాయు కాలుష్యంపై విస్త్రృతంగా చ‌ర్చ జ‌ర‌గాల‌ని ప్ర‌తిప‌క్ష‌నేత‌, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాలు కాలుష్య కోర‌ల్లో చిక్కుకున్నాయ‌ని శుక్ర‌వారం సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దేశ‌రాజ‌ధాని వాయు కాలుష్యంపై కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి ప‌ట్టింపు లేద‌ని, అత్య‌వ‌స‌రంగా చ‌ర్య‌లు తీసుకునేందుకు స‌రైన ప్ర‌ణాళిక లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

త‌న‌ను క‌లిసిన ప్ర‌తి త‌ల్లి త‌న‌కు ఒక‌టే చెబుతున్నారు. తన బిడ్డ విషపూరిత గాలిని పీల్చుకుంటూ పెరుగుతోంది. వారు అలసిపోయారు, తీవ్ర‌మైన వాయు కాలుష్యంతో భ‌యాందోళ‌న చెంద‌తున్నార‌ని, కేంద్ర ప్ర‌భుత్వంపై కోసం ఉన్నార‌ని తెలిపారు.

‘‘మోడీ జీ, భారతదేశ పిల్లలు మన ముందు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మీరు ఎలా మౌనంగా ఉండగలరు? మీ ప్రభుత్వం ఎందుకు అత్యవసరం, ప్రణాళిక లేదు, జవాబుదారీతనం లేదు?” “భారతదేశానికి వాయు కాలుష్యంపై తక్షణ, వివరణాత్మక పార్లమెంటు చర్చ మరియు ఈ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని పరిష్కరించడానికి కఠినమైన, అమలు చేయగల కార్యాచరణ ప్రణాళిక అవసరం. మన పిల్లలు స్వచ్ఛమైన గాలికి అర్హులు – సాకులు మరియు పరధ్యానాలు కాదు” అని ఆయన రాశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -