- Advertisement -
డిసెంబర్లో శ్రీలంక, భారత్ సిరీస్
ముంబయి : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ ముంగిట భారత మహిళల జట్టు స్వదేశంలో టీ20 సిరీస్ ఆడనుంది. స్వదేశంలో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో అమ్మాయిలు పోటీపడనున్నారు. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 21 నుంచి 30 వరకు జరుగనున్న టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్లకు విశాఖపట్నం వేదిక కానుండగా.. ఆఖరు మూడు మ్యాచ్లకు తిరువనంతపురం ఆతిథ్యం ఇవ్వనుంది. మహిళల ప్రీమియర్ లీగ్ జనవరి 9 నుంచి ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.
- Advertisement -



