Sunday, June 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపెంచిన మెట్రో చార్జీలు రద్దు చేయాలి

పెంచిన మెట్రో చార్జీలు రద్దు చేయాలి

- Advertisement -

– మెట్రో కార్యాలయం వద్ద వామపక్ష పార్టీల ధర్నా
– ప్రజలపై అదనపు భారాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌
నవతెలంగాణ-ఉప్పల్‌

పెంచిన మెట్రో చార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎమ్‌ఎల్‌) న్యూడెమోక్రసీ, ఎస్‌యూసీఐ, ఎంసీపీఐ నాయకులు సంయుక్తంగా శనివారం హైదరాబాద్‌ నాగోల్‌లోని మెట్రో ప్రధాన కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎల్‌అండ్‌టీ యాజమాన్యానికి వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) హైదరాబాద్‌ సెంట్రల్‌ కార్యదర్శి ఎం.వెంకటేష్‌, మేడ్చల్‌ మల్కా జిగిరి జిల్లా కార్యదర్శి పి.సత్యం మాట్లాడుతూ.. మెట్రో నష్టాలకు యాజమాన్యమే కారణమని, నష్టాలను పూడ్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గా లు చూసుకోవాలని అన్నారు. చార్జీలు పెంచడం సరైనది కాదని, వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎల్‌అండ్‌టీ యాజ మాన్యం ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి భిన్నంగా ఇప్పటికే చార్జీలు పెంచి ప్రయాణికుల నుంచి అదనంగా వసూలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వంతో కుదు ర్చుకున్న ఒప్పందంలో రైల్వే నిర్వహణ ఖర్చు సగం ప్రయాణికుల నుంచి, మిగిలిన సగం రియల్‌ ఎస్టేట్‌, యాడ్స్‌, ఇతర రిటైల్‌ వ్యాపారాల ద్వారా సమకూర్చుకోవాలని ఉందని వివరించారు. దానికి భిన్నంగా చార్జీలు పెంచడం దారుణమన్నా రు. ఫెయిర్‌ ఫిక్సేషన్‌ కమిటీ మెట్రో నష్టాల్లో ఉందని, చార్జీలకు సిఫారసు చేయడంతో పెంచారని చెప్పారు. ప్రయాణికుల ద్వారా ఏడాదికి రూ.650 కోట్లు వస్తుంటే.. యాడ్స్‌ ఇతర వనరుల ద్వారా రూ.250 కోట్లు మాత్రమే మెట్రో ఆదాయం వస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన 269 ఎకరాల భూమిని సద్వినియోగం చేసుకోలేక, నష్టాలు పూడ్చుకోవడానికి ప్రయాణికులపై భారం వేయడం సరైనది కాదన్నారు. దేశంలోనే చార్జీలు ఎక్కువగా ఉన్న మెట్రో సర్వీస్‌ హైదరాబాద్‌ అని, ఇప్పుడు మళ్లీ పెంచడంతో మరింత భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌అండ్‌టీ యాజమాన్యం ఏకపక్షంగా పెంచిందా? లేదా దీనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఉందా? అనే దానిపై ప్రభుత్వాలు స్పందించాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ నాయకులు స్టాలిన్‌ మాట్లాడుతూ.. నష్టాలు వస్తున్నాయని చార్జీలు పెంచడం సరైనది కాదన్నారు. సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు హన్మేష్‌ మాట్లాడుతూ.. మెట్రో రైలు పర్యావరణానికి మేలు చేసేదని, ప్రజా రవాణాను లాభనష్టాలతో చూడకూడదని, అవసరమైతే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. సీపీఐ ఎమ్‌ఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు ఝాన్సీ మాట్లాడుతూ.. ఎల్‌అండ్‌టీ యాజమాన్యం ఇప్ప టికే వివిధ రూపాల్లో ప్రజల నుంచి డబ్బు వసూ లు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.వినోద, ఎం.శ్రీనివాస్‌రావు, దశరథ్‌, జిల్లా కమిటీ సభ్యులు జె.వెంకన్న, ఎం.నరేష్‌, ఆర్‌. సంతోష్‌, నాయకులు గణేష్‌, గౌస్‌, నాగరాజు, వైవి, భీష్మా చారి, సీపీఐ నాయకులు యాదగిరి, శ్రీనివాస్‌, సీపీఎంఎల్‌ మాస్‌లైన్‌ నాయకులు స్వరూప, ప్రదీప్‌, అనురాధ, అరుణ, అనసూయ, ఎంసీపీఐ(యూ) జాతీయ కార్యదర్శి అనిల్‌ కుమార్‌, ఎస్‌యూసీఐ(యూ) నాయకులు తేజ, సీపీఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు విజరు కుమార్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -