- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: అగ్రకథానాయిక సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో ఉన్న లింగ భైరవి దేవాలయంలో సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి జరిగింది. ఈ మేరకు సమంత సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు. సమంత-రాజ్కు శుభాకాంక్షలు తెలుపుతూ ఈశా ఫౌండేషన్ ప్రకటన విడుదల చేసింది. అందులో వీరు భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లు పేర్కొంది. దీంతో ఈ వివాహ విధానం గురించి అందరూ వెతుకుతున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుక జరిగింది. కాగా ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Advertisement -



