- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం ఉదయం గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా (మద్నూర్ & డోంగ్లి) ఉమ్మడి మండలాలకు చెందిన ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ తరగతులు జరిగాయని ఎంపీడీవో రాణి ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలిపారు. ఈ శిక్షణ తరగతుల్లో మద్నూర్ మండల ఎంపిడిఓ, మండల తహసీల్దార్, మండల ఎంపీవో, డోంగ్లి మండల ఎంపిడిఓ అధ్యక్షతన ట్రైనర్ల ద్వారా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారికి తగు సూచనలు సలహాలు ఇచ్చి వారి సందేహాలను తీర్చి ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేలా చూడాలని కోరడం జరిగింది.
- Advertisement -



