- Advertisement -
నవతెలంగాణ – కట్టంగూర్
రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా మండలంలోని ఈదలూరు గ్రామానికి చెందిన దండంపల్లి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. గత నెలలో సూర్యాపేటలో జరిగిన రాష్ట్ర మహాసభల సందర్భంగా నూతన రాష్ట్ర కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధికి, గీత కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కమిటీ కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



