తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ బ్యానర్లపై వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరో,హీరోయిన్స్గా నటిస్తున్న యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం ‘వన్ బై ఫోర్’. బ్లాక్ బస్టర్ ‘బాహుబలి’ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన బాహుబలి పళని కె దర్శకత్వం వహిస్తున్నారు. రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈనెల 12న విడుదల చేయబోతున్నారు. ఈక్రమంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో వెంకటేష్ పెద్దపాలెం మాట్లాడుతూ, ‘టంగ్ స్లిప్ అనే పాయింట్తో ఈ క్రైమ్ డ్రామాను తీశాం. ‘బాహుబలి’కి పని చేసిన పళని టేకింగ్కు అందరూ ఫిదా అవుతారు. రాజమౌళి స్టైల్లో తీశారు. ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ కొట్టించుకుండా సినిమాను తీశారు. ఈనెల 12న వంద శాతం మేం హిట్ కొట్టబోతోన్నాం’ అని అన్నారు.
‘సుభాష్ ద్వారా నాకు రోహిత్, వెంకీ పరిచయం అయ్యారు. వారికి నేను ఓ కథ చెప్పాను. అది వాళ్లకి బాగా నచ్చింది. అలా ఒక్కొక్కరిని ఈ చిత్రంలోకి తీసుకున్నాం. సుభాష్ పాటలు, సాగర్ కొరియోగ్రఫీ బాగుంటుంది. మా ఎడిటర్ ఎంతో సపోర్ట్ చేశారు. అందరూ మా సినిమాను చూసి ఎంకరేజ్ చేయండి’ అని దర్శకుడు బాహుబలి పళని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ,’ ‘మాకు సౌత్ సినిమాలంటే చాలా ఇష్టం. తెలుగులో సినిమా ప్రేమికులు ఎక్కువగా ఉంటారు. అందుకే మేం ఇక్కడ సినిమాలు నిర్మించాలని అనుకున్నాం. మాకు టీం చాలా సహకరించింది. అందరూ అద్భుతంగా నటించారు. ఆ మూవీ చాలా బాగా వచ్చింది. అందరూ థియేటర్లో మా సినిమాను కుటుంబ సమేతంగా చూడండి’ అని అన్నారు. అపర్ణ మల్లిక్ మాట్లాడుతూ, ‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. మా మూవీ చాలా బాగా వచ్చింది. అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ కొట్టదు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



