– అసెంబ్లీలో తీర్మానం చేయాలి
– కార్మిక శాఖ మంత్రి వివేక్కు ఫెడరేషన్ వినతి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను అమలు చేయవద్దని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు బి రాజశేఖర్, గుడిగ రఘు, పి రాధిక, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి మణిమాల, మేకల కష్ణ తదితరులు సోమవారం హైదరాబాద్ లో కార్మిక ఉపాధి కల్పన శాఖా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ను కలిశారు. లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు మంత్రిని కోరారు. జర్నలిస్టుల యాక్సిడెంట్ పాలసీని పునరుద్ధరించాలనీ, త్రైపాక్షిక కమిటీ నియమించాలని, కమిటీ లో హెచ్యూజేకి ప్రాతినిధ్యం ఇవ్వాలనీ, కనీస వేతనాల జీవో సవరించాలనినీ, రాత్రి వేళ మహిళా జర్నలిస్టులకు ప్రయాణ సౌకర్యం కల్పించాలనీ కోరారు. ఈమేరకు ఫెడరేషన బందం మంత్రికి వినతిపత్రం అందజేసింది. మంత్రి స్పందిస్తూ, త్వరలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కార్మిక శాఖ పరిధిలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వివేక్ ఫెడరేషన్ బందానికి హామీ ఇచ్చారు.
వర్కింగ్ జర్నలిస్టు చట్టాలను పునరుద్ధరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



