- Advertisement -
0.7 శాతం తగ్గి రూ.1,70,276 కోట్లకు..
న్యూఢిల్లీ : దేశ జీడీపీ ఓ వైపు దూసుకుపోతోందని కేంద్ర గణాంకాల శాఖ ఇస్తోన్న రిపోర్టులకు జీఎస్టీ వసూళ్లకు పొంతన లేకుండా పోతోంది. ఈ ఏడాది నవంబర్లో దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 0.7 శాతం తగ్గి రూ.1,70,276 కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. గతేడాది నవంబర్లో రూ.1.69 లక్షల కోట్ల పన్నులు వసూళ్లయ్యాయి. దేశీయంగా జీఎస్టీ రెవెన్యూ తగ్గడం ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది.
- Advertisement -



