- Advertisement -
నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో ‘మోంథా’ తుపాను సృష్టించిన నష్టంపై కేంద్రానికి నివేదిక సమర్పించి, సహాయం కోరడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా వారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లతో సమావేశం కానున్నారు. అనంతరం పార్లమెంటులోని టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో మంగళవారం తమ పార్టీ ఎంపీలతో మంత్రులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
- Advertisement -



