Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉద్యోగికి ఓటు భయం..!

ఉద్యోగికి ఓటు భయం..!

- Advertisement -

ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులు నిర్వహణ..
బ్యాలెట్ ఓటు వేశాక దానిపై భద్రత కరువు..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్ని­కల్లో వందల్లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. దీంతో ఎవరు ఏ అభ్యర్థికి లేదా ఏ పార్టీకి ఓటు వేశారో తెలిసే అవకాశాలు ఉండవు.అయితే ఆయా పంచాయతీల పరిధిలో తక్కు­వ సంఖ్యలో పోస్టల్‌ ఓట్లు ఉంటాయి. కొన్నిచోట్ల ఒక్క­రో, ఇద్దరో ప్రభుత్వ ఉపాధ్యాయులు,ఉద్యోగు­లు ఉంటారు.వారు తమ ఓటు హక్కును పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వినియోగించుకోవాలని అనుకున్నప్పుడు.. దరఖాస్తు చేసుకొని బ్యాలెట్‌ పత్రంలో తమకు నచ్చిన వ్యక్తికి పెన్నుతో టిక్‌ చేస్తారు. అయితే కౌంటింగ్‌ సమయంలో ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు.

ఆ ఊళ్లో ఒకే ఉద్యోగి,ఉపాధ్యాయు­డు ఉండి, ఆయన ఎవరో ఒకరికి ఓటు వేసినప్పుడు తన ఓటు ఎవరికి వేశారో బహిర్గతమవుతుంది. తద్వారా తమకు ఓటు వేయలేదని ఇతరులు ఆ ఉద్యోగిపై కక్ష పెంచుకునే అవకాశం ఉంటుంది.గ­తం­లో పలుచోట్ల ఓటు రహస్యం బహిర్గతమై వివాదాలు ఎదురయ్యాయని ఓ ఉపాధ్యాయుడు ‘సాక్షి’­తో తన ఆవేదన వ్యక్తం చేశారు. కౌంటింగ్‌ సమయంలో పోస్టల్‌ బ్యాలెట్‌లను సాధారణ బ్యాలెట్‌ పత్రా­ల్లో కలిపితే ఏ సమస్యా ఉండదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల అధికారులు తక్షణమే దీని­పై చర్యలు తీసుకొని పోస్టల్‌ బ్యాలెట్‌ వల్ల ఎదుర­య్యే ఇబ్బందులను తొలగించాలని ఉద్యోగులు,ఉపాధ్యాయులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -