Tuesday, December 2, 2025
E-PAPER
Homeకరీంనగర్జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి: టీయూడబ్ల్యూజే

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి: టీయూడబ్ల్యూజే

- Advertisement -

టీయూడబ్ల్యూజే మహా ధర్నా కరపత్రాల ఆవిష్కరణ..
నవతెలంగాణ – వేములవాడ

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో డిసెంబర్ 3న హైదరాబాద్‌లో జరగనున్న మహా ధర్నా కరపత్రాలను వేములవాడ పట్టణంలో మంగళవారం కరపత్రాల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దండి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలి, ఆరోగ్య భీమా పథకాన్ని పునరుద్ధరించాలి ప్రభుత్వాన్ని కోరారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి, వృత్తి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి అని అన్నారు.

డిసెంబర్ 3న హైదరాబాద్ మసాబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటలకు జరగనున్న మహా ధర్నాను విజయవంతం చేయడానికి రాష్ట్ర, జాతీయ, జిల్లా, మండల స్థాయి నాయకులు, యూనియన్ సభ్యులు భారీగా తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు రేగుల దేవేందర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నూగురి మహేష్, జిల్లా జాయింట్ సెక్రెటరీ రాపల్లి శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రెటరీ దూలం సంపత్, కార్యవర్గ సభ్యులు మ్యాన శ్రీనివాస్, ఉల్లెందుల మల్లేశం, సయ్యద్ పాష, జర్నలిస్టులు గడిల ప్రవీణ్ కుమార్, ఎం.ఏ. కలీం పాషా, గంప మహేష్, తోట అనిల్ కుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -