- Advertisement -
– మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో పాల్గొనాలని ఏఐసీసీ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మంగళవారం న్యూఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో ముఖ్యమంత్రి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, ఉద్దేశాలను ఖర్గేకు వివరించారు. ఖర్గేతో సమావేశమైన వారిలో పలువురు పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొన్నారు.
- Advertisement -



