- Advertisement -
హైదరాబాద్ : నగర కేంద్రంగా పని చేస్తోన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ ఎఎస్బీఎల్ తమ గ్లోబల్ విస్తరణ సిరీస్లో భాగంగా మధ్యప్రాచ్యంలోనూ ఎన్ఆర్ఐ రియాలిటీ మీట్ను నిర్వహించినట్లు తెలిపింది. ఈ కార్యక్రమం మస్కట్, దోహా, అబుదాబి, దుబారులలో జరిగిందని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది గల్ఫ్ మార్కెట్లోకి ఏఎస్బీఎల్ అధికారిక ప్రవేశాన్ని సూచించటంతో పాటుగా గ్లోబల్ ఇండియన్ కమ్యూనిటీలో అంతర్జాతీయ పెట్టుబడులను పెంచే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని ఏఎస్బీఎల్ ఫౌండర్, సీఈఓ అజితేష్ కొరుపోలు తెలిపారు. భారతదేశంలో అత్యంత స్థిరమైన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటిగా హైదరాబాద్ నిరంతర ఎదుగుదలను కలిగి ఉందన్నారు.
- Advertisement -



