- Advertisement -
నవతెలంగాణ – కడ్తాల్
కడ్తాల్ మండలం మక్తమాధారం గేట్ సమీపంలో బుధవారం ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా కారుకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. కారు ముందు భాగం నుంచి పొగ రావడం గమనించిన ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే వాహనం ఆపి బయటకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. కొద్ది సేపటికే మంటలు పూర్తిగా కారును చుట్టుముట్టడంతో వాహనం పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
- Advertisement -



