హీరో విరాట్ కర్ణ, దర్శకుడు అభిషేక్ నామా కాంబినేషన్లో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న పాన్-ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నాగబంధం’.
ప్రస్తుతం టీం నానక్రామగూడలోని రామానాయుడు స్టూడియోలో క్లైమాక్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తోంది. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అను భూతిని అందించేందుకు మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నారు. కేవలం క్లైమాక్స్ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత ఖరీదైన క్లైమాక్స్ సీక్వెన్స్లలో ఒకటిగా ఇది నిలువనుంది. ఓ మహాద్వారం చుట్టూ రూపుదిద్దుకున్న ఈ క్లైమాక్స్ సెట్ కథలోని భావోద్వేగం, డ్రామా విజువల్గా అద్భుతంగా చూపించేలా డిజైన్ చేశారు. ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ తన బృందంతో కలిసి సెట్లోని ప్రతి అంశాన్ని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించి, కథనం స్థాయిని మరింతగా పెంచేలా కేర్ తీసుకున్నారు.
అద్భుతమైన యాక్షన్కు కేరాఫ్గా నిలిచిన థాయ్ స్టంట్ మాస్టర్ కేచా ఖాంఫాక్డీని టీం ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఆయన బ్రీత్ టేకింగ్ యాక్షన్ కొరియోగ్రఫీతో సీక్వెన్స్ని గ్రాండ్గా తీర్చిదిద్దితున్నారు. ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసే స్టంట్స్, యాక్షన్ సన్నివేశాలతో ఈ సీక్వెన్ అద్భుతంగా, విజువల్గా మైండ్ బ్లోయింగ్గా ఉండబోతోంది. ఇందులో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు, జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ,బి.ఎస్. అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా కథ భారతదేశంలోని ప్రాచీన విష్ణు ఆలయాల నేపథ్యంపై సాగుతుంది. శతాబ్దాలుగా రహస్యంగా కొనసాగుతున్న ‘నాగబంధం’ అనే ఆధ్యాత్మిక సంప్రదాయం చుట్టూ నడిచే ఈ కథ.. పద్మనాభస్వామి, పూరి జగన్నాథ్ ఆలయాల ధన నిధుల మిస్టరీల స్ఫూర్తితో ఉంటుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
రూ.20 కోట్లతో క్లైమాక్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



