- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల కలెక్టరేట్ల ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాల ప్రతిష్టాపనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 9న తెలంగాణ తల్లి దినోత్సవం సందర్భంగా ఈ విగ్రహాలను ఆవిష్కరించాలని నిర్ణయించారు. గత ఐదారు నెలలుగా విగ్రహ నిర్మాణ పనులు జరుగుతుండగా, అవి చివరి దశకు చేరుకున్నాయి. ఒక్కో విగ్రహానికి రూ.15.5 లక్షల నుంచి రూ.17.5 లక్షలు కేటాయించారు.
- Advertisement -



