హీరో శ్రీ నందు నటించిన చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. ఈనెల 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ యామిని భాస్కర్ మీడియాతో ముచ్చటించారు. ”నర్తనశాల’ తర్వాత రెండేళ్లు గ్యాప్ వచ్చింది. డైరెక్టర్ వరుణ్ ఫ్రెండ్ ఈ కథ చెప్పాడు. డైవర్స్ తీసుకున్న అమ్మాయి, తనకు ఒక పిల్లాడు కూడా వుంటాడు. ఈ క్యారెక్టర్ చేస్తావా అని అడిగారు. కొత్తగా అనిపించింది. ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటివరకు నేను చేయలేదు. తర్వాత డైరెక్టర్ వరుణ్ని కలిశాను. ఆయన కథ చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది. వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ విమెన్ క్యారెక్టర్ చేశాను. పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉంది. కచ్చితంగా ఈ సినిమా తర్వాత నాకు మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంది.
ఈ సినిమా టీజర్, ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత అర్జున్ రెడ్డితో పోలికలు ఉన్నాయని చాలా మంది అన్నారు. అయితే పోస్టర్ లుక్కు అలా ఉంటుందేమో కానీ ఈ కథకు అర్జున్ రెడ్డికి సంబంధం లేదు. అర్జున్ రెడ్డి, సిద్ధార్థ ఈ రెండు క్యారెక్టర్స్ టోటల్ డిఫరెంట్. ఇందులో నా క్యారెక్టర్ పేరు శ్రావ్య. ఒక హానికరమైన రిలేషన్ నుంచి బయటకు వచ్చి స్వతహాగా బతకాలను కుంటుంది. ఇదే సమయంలో సిద్ధార్థకి బ్రేక్ అప్ అయి ఉంటుంది. తను అన్ని వదిలేసి ఒక బస్తీలో ఉండడానికి వస్తాడు. అక్కడ మేము కనెక్ట్ అవుతాము. అప్పుడు ఒక ప్రేమ కథ మొదలవుతుంది. అక్కడి నుంచి చాలా బ్యూటీఫుల్ జర్నీ ఉంటుంది. ఇది ఒక సహజమైన ప్రేమ కథ. అందరూ రిలేట్ అయ్యేలా ఉంటుంది’ అని కథానాయిక యామిని భాస్కర్ చెప్పారు.
నటనకు అవకాశం ఉన్న పాత్ర చేశా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



