- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధిలో రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కీలక పాత్ర పోషించనుందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆమె సందేశం పంపించారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగస్వాములు కావాలనుకునే వారికి ఈ సదస్సు వేదికగా నిలుస్తుందన్నారు. ఈ నెల 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నందుకు… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోనియాగాంధీ అభినందనలు తెలిపారు.
- Advertisement -



