నవతెలంగాణ-హైదరాబాద్: ఎలన్ మస్క్కి చెందిన సోషల్ మీడియా ‘ఎక్స్’పై యూరోపియన్ యూనియన్ (ఈయు) నియంత్రణ సంస్థ భారీ జరిమానా విధించింది. సోషల్ మీడియా చట్టాన్ని ఉల్లంఘించినందున 120 మిలియన్ యూరోలు(సుమారు 12వేలకోట్లకు పైగా) జరిమానా విధించినట్లు ఇయు శుక్రవారం తెలిపింది. 27 దేశాల కూటమికి చెందిన డిజిటల్ సర్వీసెస్ చట్టం ప్రకారం రెండేళ్ల క్రితం దర్యాప్తు ప్రారంభించిన యూరోపియన కమిషన్ నేడు తన తీర్పు వెల్లడించింది. డిఎస్ఎ చట్టంను అనుసరించి ఎక్స్ మూడు వేర్వేరు ఉల్లంఘనలకు పాల్పడినందున జరిమానా విధించినట్లు యూరోపియన్ కమిషన్ తెలిపింది.
డిజిటల్ సర్వీస్ యాక్ట్ (డిఎస్ఎ) ప్రకారం.. యూరోపియన్ వినియోగదారులకు భద్రత కల్పించడం, భారీ జరిమానా విధించవచ్చనే బెదిరింపులతో సహా వారి సోషల్మీడియా ప్లాట్ఫామ్లలో హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్, వాటి ఉత్పత్తులను తొలగించేందుకు బాధ్యత వహిస్తుంది.ఎక్స్ నీలిరంగు చెక్ మార్కులు వాటి మోసపూరిత డిజైన్ కారణంగా నిబంధనలను ఉల్లంఘించాయని, ఇది వినియోగదారులను మోసగించేందుకు, తారుమారు చేస్తుందని ఇయు తెలిపింది. ఎక్స్ ప్రకటన డేటా బేస్ అవసరాలను కూడాతీర్చలేకపోయిందని, పరిశోధకుల పబ్లిక్ డేటాను యాక్సెస్ చేసేసందుకు వీలు కల్పించింది.



