Saturday, December 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసింగరేణి విజన్‌ డాక్యుమెంట్‌ 2030-2047 విడుదల

సింగరేణి విజన్‌ డాక్యుమెంట్‌ 2030-2047 విడుదల

- Advertisement -

– 2030 నాటికి స్వల్ప, మధ్యకాలిక ప్రణాళిక , 2047 నాటికి దీర్ఘకాలిక ప్రణాళికల రూపకల్పన
– 2030 నాటికి బహుముఖ వ్యాపార విస్తరణలు, భారీ అభివృద్ధి వ్యూహాలు
– 2030 నాటికి 100 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి
– మొత్తం 5,850 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తు
– దీర్ఘకాలిక ప్రణాళికలో 2047 నాటికి 15 వేల మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తు
– 25 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్తు ఖనిజ రంగంలో ప్రవేశం, అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్‌ సింగరేణి లిమిటెడ్‌ ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విజన్‌ 2047కు అనుగుణంగా సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ కూడా తన విజన్‌ 2030-2047 డాక్యు మెంట్‌ను ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్‌ సింగరేణి భవన్‌లో జరిగిన సమావేశంలో సంస్థ చైర్మెన్‌, ఎండీ ఎన్‌.బలరామ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. ఈ సమావేశంలో ఆ సంస్థ డైరెక్టర్లు, వివిధ విభాగాల ఏరియాల జనరల్‌ మేనేజర్లు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ భవిష్యత్తుతో పాటు రాష్ట్ర, దేశ అవసరాలకు అనుగుణంగా కంపెనినీ బొగ్గు రంగంతో పాటు ఇతర రంగాల్లోకి పెద్ద ఎత్తున విస్తరింపజేయాలని ప్రణాళికలు రూపొందించినట్టు బలరామ్‌ తెలిపారు. ముఖ్యంగా వివిధ రకాల పునరు త్పాదక విద్యుత్తు ఉత్పత్తి భారీ ఎత్తున ప్రణాళికలు తయారు చేశామనీ, దేశ విదేశాల్లో కీలకమైన ఖనిజ రంగంలో ప్రవేశించడానికి సింగరేణికి అనుబంధంగా గ్లోబల్‌ సింగరేణి లిమిటెడ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు, విజన్‌ డాక్యుమెంట్‌లోని స్వల్ప, మధ్య కాలిక ప్రణాళికలో 2030 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాన అంశాలు ఈ విధంగా ఉన్నాయి.

సింగరేణి సంస్థ 2030 నాటికి 100 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టు కుంది. దీని కోసం ప్రస్తుత లీజు ప్రాంతంలోనే కాక, లీజుకు వెలుపల ఉన్న ప్రాంతంలోని కొత్త బ్లాకులను, వివిధ రాష్ట్రాలలోని కొత్త బ్లాకులను కూడా చేపట్టాలని నిర్ణయించింది. ప్రస్తుత 1,200 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తు ఉత్పాదనను 4,400 మెగావాట్లకు పెంచాల ని అందుకు అనుగుణంగా కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం 245.5 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న సింగరేణి సంస్థ 2030 నాటికి 2 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్తును ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా రాజస్థాన్‌లో అతి త్వరలోనే 1,500 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబో తుంది. రాష్ట్రంలోని పలు భారీ నీటి జలాశయాలపైన 800 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నది.

ఎత్తైన ఓపెన్‌కాస్ట్‌ డంపులపైన 100 మెగావాట్ల పవన విద్యుత్తు ఉత్పత్తి కోసం ప్లాంట్లను ఏర్పాటు చేయబోతోంది. 500 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్న కంపెనీ తొలి దశలో మూతబడిన మేడిపల్లి ఓపెన్‌ కాస్ట్‌ గని వద్ద 250 మెగావాట్ల ప్లాంటును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మణుగూరుకు సమీపంలోని పగిడేరు వద్ద ప్రయోగాత్మకంగా విజయవంతమైన జియో థర్మల్‌ ప్లాంటు వద్ద 200 మెగావాట్ల జియో థర్మల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనీ, ప్రణాళికలు రూపొందించారు. ఇది కాక ఎఫ్‌.డి.ఆర్‌.ఈ హైబ్రీడ్‌ ఆర్టీసి విభాగాలలో కలిపి మరో 1,500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయాలనీ, 700 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టంలను వివిధ సోలార్‌ ప్లాంట్ల వద్ద ఏర్పాటు చేయాలని కూడా ప్రణాళికలు రూపొందించింది. దీనితో మొత్తం మీద 2029-30 నాటికి సింగరేణి 5.85 గిగావాట్ల (5,850 మెగావాట్ల) పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేయాలని విజన్‌ డాక్యుమెంట్‌లో స్పష్టం చేసింది. సింగరేణి ఖనిజ రంగంలోకి కూడా ప్రవేశిం చాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశవిదేశాల్లో ఈ రంగంలో గల అవ కాశాలను పరిశీలించడం కోసం ప్రఖ్యాత పరిశోధన సంస్థలతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చు కుందనీ, రాగి, బంగారం అన్వేషణకు లైసెన్స్‌ కూడా సాధించిందనీ, ఇక ముందు కూడా ఈ రంగం లో దూకుడుగా ముందుకుపోవాలని నిర్ణయించింది. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించడానికి సింగరేణికి అనుబంధంగా గ్లోబల్‌ సింగరేణి లిమిటెడ్‌ అనే అనుబంధ సంస్థ ఏర్పాటును విజన్‌ డాక్యుమెంట్‌లో సూచించారు.

దీర్ఘకాలిక ప్రణాళిక- విజన్‌ 2047లో లక్ష్యాలు
సింగరేణి సంస్థ తన దీర్ఘకాలిక ప్రణాళిక 2047 లో అవసరమయ్యే థర్మల్‌ విద్యుత్తును, 5 వేల మెగా వాట్ల సోలార్‌ విద్యుత్తును, 2,815 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ను, 1,500 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ ప్లాంట్లను, 500 మెగావాట్ల జియో థర్మల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని తలపెట్టింది. మొత్తానికి 25 గిగావాట్ల పరిమాణంలో వివిధ రకాల పునరుత్పా దక విద్యుత్తును ఉత్పత్తి చేయాలని విజన్‌ డాక్యు మెంట్‌లో పేర్కొంది. సింగరేణి రక్షణతో కూడిన ఉత్పా దకత గల ఆధునిక టెక్నాలజీలతో బొగ్గు ఉత్పత్తులు సాధిస్తుంది. అనేక కార్మిక ప్రయోజన, ప్రజాహిత చర్యలు. నూతన టెక్నాలజీకి అనుగుణంగా ఆటోమేషన్‌ పద్ధతులకు తగిన విధంగా ఉద్యోగులకు శిక్షణలు ఇవ్వడం. ఉద్యోగులకు పటిష్ట ఆరోగ్య రక్షణ, భద్రత, సంక్షేమ కార్యక్రమాలు. సామాజిక బాధ్యత కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాల పెంపుదల. మహిళా ఉద్యోగుల సేవలను ఓపెన్‌ కాస్ట్‌, భూగర్భగనుల్లోని కీలక విభాగాల్లో వినియోగించడం వంటి ప్రాధాన్యత కలిగిన చర్యలను విజన్‌ డాక్యుమెంట్‌లో సింగరేణి సంస్థ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -