- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఇంచార్జ్ వీసీగా నియమితులైన డాక్టర్ రమేశ్ రెడ్డి శుక్రవారం సంగారెడ్డిలో మంత్రి దామోదర్ రాజనర్సింహను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రమేశ్రెడ్డిని మంత్రి అభినందించారు. రాష్ట్రంలో వైద్య విద్య నాణ్యతను పెంచేందుకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని రమేశ్ రెడ్డికి ఈ సందర్భంగా మంత్రి సూచించారు.
- Advertisement -



