- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :అమెరికాలోని బర్మింగ్హామ్లో విషాదం నెలకొంది. తెలుగు విద్యార్థులు నివసిస్తున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం సంభవించి, ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరణించిన వారిలో ఉడుముల సహజ రెడ్డి, కూకట్పల్లికి చెందిన మరొక విద్యార్థి ఉన్నారు. వీరంతా అలబామా యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నారు. అగ్నిప్రమాదంలో చిక్కుకున్న విద్యార్థులను అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు.
- Advertisement -



