Saturday, December 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఇంటి నుంచి ఓటు.. లేనట్లేనా.?

ఇంటి నుంచి ఓటు.. లేనట్లేనా.?

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : రెండేళ్ల క్రితం జరిగిన శాసనసభ,లోక్ సభ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు ఇంటివద్ద నుంచే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. నడవలేని, చేతగాని, మంచానికే పరిమితమైన వృద్ధులు పోలింగ్ కేంద్రానికి వెళ్లలేక పోవ డంతో వారు తమ ఓటుహక్కును వినియోగించుకోలేక పోతున్నారు. ఫలితంగా ఓటింగ్ శాతం తగ్గుతోంది. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అటువంటి వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించింది.కానీ ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నిక ల్లో మాత్రం అలాంటి అవకాశం ఇవ్వలేదు. సర్పంచ్, వార్డు సభ్యులకు ఓటు వేసేందుకు దివ్యాంగులు, వృద్ధులు ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవ కాశం కోసం ఎదురు చూస్తున్నా ఎన్నికల సంఘం నుంచి అలాంటి ప్రకటన ఏదీ నేటికీ రాలేదు.
గత ఎన్నికల్లో ఇలా..
గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటరు జాబితాలో పేరుండి 85 ఏళ్లకు పైబడిన వృద్దులు, 45 శాతానికి పైగా వైకల్యం ఉన్న వారు ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు.ఇందుకు ప్రత్యే కంగా 12-డీ ఫారాన్ని ముంద స్తుగానే నింపి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.అధికారులు వారు ఇచ్చిన అడ్రసు పూర్తిస్థాయి భద్రతతో పోలింగ్ సామాగ్రితో వెళ్లి ఓటు వేయించారు.ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవ కాశం లేక పోవడంతో వారు కచ్చితంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. పోలింగ్ సమయం కూడా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఉంటుంది. నిర్ణీత సమయం లోపు కుటుంబ సభ్యులు వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు వేయించాల్సి ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -