- Advertisement -
అంబేద్కర్ చూపిన మార్గంలో నడుచుకుందాం: ప్రెస్ క్లబ్ అధ్యక్షులు హనుమాన్లు
నవతెలంగాణ – మద్నూర్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని మండల విలేకరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు హనుమాన్లు మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకుందామని సూచించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం సమానత్వ హక్కులు లభిస్తున్నాయని ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్దామని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు హనుమాన్లు ఉపాధ్యక్షులు శివాజప్ప కోశాధికారి నాగేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



