Saturday, December 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దుబ్బకాల్వ గ్రామ అభివృద్ధికి సేవకుడిగా పనిచేస్తా..

దుబ్బకాల్వ గ్రామ అభివృద్ధికి సేవకుడిగా పనిచేస్తా..

- Advertisement -

దుబ్బకాల్వ కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి కొండ శ్రీను..
నవతెలంగాణ- మునుగోడు

దుబ్బకాల్వ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఆశీర్వదిస్తే నాయకుడిగా కాదు ప్రజల సేవకుడిగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని దుబ్బకాల్వ కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి కొండ శ్రీను అన్నారు. శుక్రవారం ఆ గ్రామంలోని పలు వార్డులలో ఇంటింటి ప్రచారం చేపట్టారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తే గ్రామ అభివృద్ధికి అడుగులు పడతాయని అన్నారు. మునుగోడు నియోజవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే గొప్ప లక్ష్యంతో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధికి అధిక నిధులు తీసుకువచ్చి మునుగోడు మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు. 

గ్రామ అభివృద్ధి తమ లక్ష్యంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు గ్రామంలోని ప్రజలు కత్తెర గుర్తుపై ఓటు వేసి తమను ఆశీర్వదించాలని కోరారు. గ్రామ శాఖ అధ్యక్షుడు దండు వెంకన్న, వడ్డేపల్లి ధర్మయ్య , అంబాలపల్లి శంకర్, బెల్లీ శైలజ , షేక్ ఇబ్రహీం , ఎస్.కె రియాజ్ , జక్కల నాగరాజు, దోటి యశోద, రాజన్న వీరాభిమాని ,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బెల్లి పూర్ణ యాదవ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -