కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎడ్ల రామ్ రెడ్డి
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
కాచారం గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ ఎన్నికలలో ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి, ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎడ్ల రామ్ రెడ్డి అన్నారు. శనివారం, యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామంలోని వీధుల్లో ఇంటింటికి తిరుగుతూ గ్రామ నాయకులు కార్యకర్తలతో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.
ఆపదలో ఆదుకుంటూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ సమస్యలను పరిష్కారం చేస్తానని అన్నారు. గ్రామంలో వాటర్ ఫిల్టర్ పెట్టి ఉచితంగా మంచినీరు అందిస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తోటే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అందజేసింది అని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో గ్రామాల్లో పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటున్నారని, గ్రామాల్లో చెరువులు నిండడంతో రైతుల సంతోషంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సలీం, పల్లపు బాలయ్య, బుచ్చిరెడ్డి, ఇప్ప రాజయ్య, కొండల్ రెడ్డి, గండికోట మల్లేశం, ఓగ్గు మల్లేశం, దడిగే చంద్రమౌళి, బీబీ నగరం లక్ష్మణ్, ఒగ్గు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.



