నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వృద్ధి 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికలపై పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిష్ణాతులతో చర్చాగోష్ఠులు నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. వికసిత్ భారత్-2047లో తెలంగాణ రైజింగ్ కూడా ఓ భాగమని అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకు వెళ్తోందని తెలిపారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ ఎదగాలని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ అడుగులు వేస్తోందని.. అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఆ లక్ష్యం దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజన్తో ముందుకు వెళ్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
తెలంగాణ గ్లోబల్ సమిట్ ప్రారంభించిన గవర్నర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



