- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. వారాసిగూడ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ ఇంటర్ విద్యార్థిని (17) దారుణ హత్యకు గురైంది. పెళ్లికి ఒప్పుకోలేదని మేనమామ వరసయ్యే యువకుడు విద్యార్థినిని ఆమె తల్లి ముందే కత్తితో గొంతు కోసి దారుణంగా చంపాడు. సమాచారం అందుకున్న వారసిగూడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



