Tuesday, December 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపనిచేసే నాయకులకు ఓటెయ్యాలి

పనిచేసే నాయకులకు ఓటెయ్యాలి

- Advertisement -

– నిజమైన ప్రజా సేవకులను ఎన్నుకోవాలి : మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
– పలు చోట్ల సీపీఐ(ఎం) అభ్యర్థుల ఏకగ్రీవం
నవతెలంగాణ-మిర్యాలగూడ

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు ఆలోచించి.. పని చేసే నాయకులకు ఓటు వేయాలని, నిజమైన ప్రజాసేవకులను ఎన్నుకోవాలని, వామపక్ష ప్రజాతంత్ర లౌకికశక్తుల అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో 10 వార్డుల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులు ఏకగ్రీవమైనట్టు తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నిత్యం ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తూ పరిష్కారం కోసం కృషి చేస్తున్న నాయకులను ఎన్నికల్లో ఎన్నుకోవాలని కోరారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేసే ఆలోచన కేవలం వామపక్ష ప్రజాతంత్ర, లౌకికశక్తుల అభ్యర్థులకు మాత్రమే ఉంటుందని తెలిపారు. అలాంటి వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే సమస్యలు పరిష్కారం కావడంతోపాటు గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.గ్రామాల ప్రతిష్ట పెంచే సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో 16 గ్రామ పంచాయతీలలో సర్పంచులకు, 150పైగా వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్నామని తెలిపారు. ఇందులో ఇప్పటికే 10 వార్డుల్లో సీపీఐ(ఎం) బలపర్చిన అభ్యర్థులు ఏకగ్రీవమైనట్టు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు పాదూరి శశిధర్‌రెడ్డి, వినోద్‌ నాయక్‌, రాగిరెడ్డి మంగారెడ్డి, నాయకులు గోవింద్‌రెడ్డి, దయానంద్‌, సంపత్‌ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -