- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా మండలంలోని రైతు వేదిక వద్ద ఎంపీఓ నారాయణ ఆధ్వర్యంలో ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి, ఎన్నికల సామాగ్రి పై వివరించారు. ఎన్నికల పోలింగ్ రోజు వ్యవహరించాల్సిన విధి విధానాలను, ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ చేపట్టే అంశాలపై శిక్షణ ఇచ్చారు. పోలింగ్ సమయంలో ఏలాంటి తప్పులు దొర్లకుండ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.కార్యక్రమంలో ఎమ్మార్వో ఉమా, ఎంపీడీవో శంకర్ నాయక్, ఎస్సై వీరబాబు , అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -



