నవతెలంగాణ – హైదరాబాద్ : సికింద్రాబాద్లో దారుణం జరిగింది. 13 ఏండ్ల బాలికపై నలుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు ఓ లాడ్జిలో బాలికతో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరి వయస్సు 19 ఏండ్ల చొప్పున, మరో ఇద్దరి వయస్సు 17 ఏండ్ల చొప్పున ఉందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బాలిక ఈ నెల 4వ తేదీన అదృశ్యమైంది. దాంతో తమ కూతురు (13) కనిపించడం లేదని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా బాలిక సికింద్రాబాద్ పరిధిలోని ఒక లాడ్జిలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి నిందితులను అరెస్ట్ చేశారు.
సికింద్రాబాద్లో 13 ఏండ్ల బాలికపై సామూహిక లైంగికదాడి
- Advertisement -
- Advertisement -



