- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడో, నార్వే రాజధాని ఓస్లోలో జరగనున్న నోబెల్ పురస్కార ప్రదానోత్సవానికి ముందు నిర్వహించే మీడియా సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో నిర్వాహకులు మీడియా సమావేశాన్ని రద్దు చేశారు. దేశం దాటి బయటకు వెళ్తే పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని వెనెజువెలా అటార్నీ జనరల్ హెచ్చరించిన నేపథ్యంలో, ఆమె అవార్డు స్వీకరించడానికి వస్తారా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి.
- Advertisement -



