- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని గోజేగావ్ గ్రామ సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైన భారత్ రాథోడ్ కు ఆ గ్రామ పెద్దలు సంతోష పటేల్ శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భరత్ రాథోడ్ మాట్లాడుతూ.. గ్రామ పెద్దలు ఆదర్శవంతులు సంతోష్ పటేల్ సలహాలు సూచనల మేరకు గ్రామ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలందరికీ ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యునిగా ఎన్నికైన శివకుమార్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



