Friday, December 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండిజిటల్‌ సేఫ్టీలో రోల్‌ మోడల్‌గా తెలంగాణ

డిజిటల్‌ సేఫ్టీలో రోల్‌ మోడల్‌గా తెలంగాణ

- Advertisement -

– విజన్‌ 2047 డాక్యుమెంట్‌లో సమగ్రంగా రోడ్‌మ్యాప్‌
– పౌరుల భాగస్వామ్యంతోనే సైబర్‌ మోసాలకు అడ్డుకట్ట : ఎస్‌సీఎస్‌సీ కాంక్లేవ్‌ 2025లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తెలంగాణను డిజిటల్‌ సేఫ్టీలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌ గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే ”తెలంగాణ రైజింగ్‌ విజన్‌ – 2047” డాక్యుమెంట్‌లోనూ సమగ్రంగా రోడ్‌మ్యాప్‌ను పొందుపర్చామన్నారు. గురువారం హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ”సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌ సీ ఎస్‌ సీ) కాంక్లేవ్‌ 2025”ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతూ సైబర్‌ నేరగాళ్లు సవాలు విసురుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 265 మిలియన్లకుపైగా సైబర్‌ దాడులు జరిగాయని గుర్తు చేశారు. తెలంగాణలోని కీలక రంగాలకు చెందిన సంస్థలు, కంపెనీలపై గతేడాది 17 వేలకు పైగా రాన్సమ్‌ వేర్‌ దాడులు జరిగినట్టు ఓ ప్రముఖ సెక్యూరిటీ సంస్థ అధ్యయనంలో తేలిందని చెప్పారు. ఒక్క సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోనే ఏడాది వ్యవధిలో రూ.800 కోట్లకు పైగా సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టడం వాస్తవ పరిస్థితికి నిదర్శనమన్నారు. ఇలాంటి తరుణంలో సాంప్రదాయ పోలీసింగ్‌ కాకుండా స్మార్ట్‌ పోలీసింగ్‌ అవసరమని గుర్తు చేశారు. పౌరుల భాగస్వామ్యంతోనే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేయగలమని వివరించారు. మోసం జరిగిన తర్వాత కాకుండా ముందే స్పందించి సైబర్‌ నేరగాళ్లను కట్టడి చేసే వ్యవస్థ అవసరమన్నారు. కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీస్‌ ఆధారిత ఇంటిగ్రేటెడ్‌ డేటా సిస్టమ్స్‌, రియల్‌ టైం మానిటరింగ్‌, ఓపెన్‌ ఇన్ఫర్మేషన్‌ లాంటి అధునాతన వ్యవస్థల ద్వారా తమ ప్రభుత్వం పౌరుల డిజిటల్‌ సేఫ్టీకి చిత్తశుద్ధితో కషి చేస్తోందన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తూ… వారిని వారిjర్లుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ యూఎస్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ (హైదరాబాద్‌) లారా విలియమ్స్‌, ఏడీజీపీ చారుసిన్హా, సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి, ఎస్‌సీఎస్‌సీ సెక్రెటరీ జనరల్‌ రమేష్‌ ఖాజా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -