- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగర్లో సర్పంచి అభ్యర్థి మృతి చెందాడు. ఇక్కడి సర్పంచి స్థానానికి దామాల నాగరాజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. కానీ ఎన్నికల ప్రచారంలో ఒత్తిడితో అస్వస్థతకు గురయ్యాడు. ఈక్రమంలో శనివారం సాయంత్రం ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు.
- Advertisement -


