- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఇప్పలపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కోడారి చిన మల్లన్న సర్పంచ్ గా గెలుపు తథ్యమేని గ్రామంలో చర్చనీయంగా మారింది. గ్రామంలోని అన్నివర్గాల ప్రజలు మల్లన్నకే పట్టం కష్టాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఉంగరం గుర్తుకే ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు. ప్రచారంలో భాగంగా ఏ గల్లికి వెళ్లిన జనం నుంచి విశేషంగా ఆదరణ వస్తుంది. ప్రజలు తన ఉంగరం గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదిస్తే మంత్రి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ,ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చూస్తానని చినమల్లు హామీ ఇచ్చారు.
- Advertisement -



